by సూర్య | Tue, May 17, 2022, 09:14 PM
నటుడు, గాయకుడు సిద్దార్ధ్ వృత్తి పరంగా ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. హీరోగా తనను సంతృప్తి పరిచే పాత్రలు వచ్చేంత వరకు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతానన్న ఆయన ఎప్పుడైతే, అలాంటి అవకాశాలు రావడం ఆగిపోతాయా అప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేసి, ఏదైనా ఉద్యోగం వెతుక్కుంటానని ఎంతో ధైర్యంగా తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. సిద్దార్థ్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ నటి నివేదా పేతురాజ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేసారు. మెంటల్ మదిలో అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నివేదా ఆపై చిత్రలహరి, అల వైకుంఠపురంలో అనే సినిమాలలో నటనకు ఆస్కారమున్న పాత్రలతో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఒక పక్క హీరోయిన్ గా కొనసాగుతూనే, మరో పక్క వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటుంది. ఇటీవలే ఆమె తెలుగులో నటించిన బ్లడీ మేరీ వెబ్ సిరీస్ విడుదలై సక్సెస్ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా ... హీరోయిన్ అవ్వడం కాదు నటి గా ప్రేక్షకుల చేత పిలిపించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైతే నాకు అవకాశాలు కరువవుతాయో, అప్పుడు సినిమాలకు స్వస్తి చెప్పి ఏదైనా ఉద్యోగం చేసుకుంటా. ఆ సత్తా నాకుంది... అంటూ వ్యాఖ్యానించింది.
Latest News