by సూర్య | Mon, Jan 10, 2022, 01:58 PM
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం సూపర్ హిట్ టాక్ తో తెచ్చుకుంది. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్, ధనంజయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే బాలీవుడ్లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నట్లుగా పుష్పరాజ్ తన హవా చూపిస్తున్నాడు. పుష్ప ది రైజ్ బాలీవుడ్లో ఇప్పటి వరకు రూ.80 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆదివారం మరో రూ.3.40 కోట్లు వసూలు చేసి రూ.80 కోట్లకు చేరుకుంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ, ఫహద్ ఫాజిల్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. పుష్ప ది రూల్ సినిమా రెండో భాగం త్వరలో సెట్స్ పైకి రానుంది.
Latest News