by సూర్య | Sun, Nov 21, 2021, 08:57 AM
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ మహారాష్ట్రలోని ముంబైలో నివాసం ఉంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఉంటున్న భవనంలోని 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అలాగే అక్కడే ఉన్న కొందరు స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రకుల్ ప్రీత్ సింగ్ నివాసానికి వచ్చారు. అలాగే చెలరేగుతున్న మంటలను అదుపు చేస్తుంది. ఈ మంటల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో హీరోయిన్ రకుల్ ఇంట్లో లేదు. షూటింగ్ కోసం వేరే ప్రాంతంలో ఉంది. ఈ విషయం తెలిసిన రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు ఎలా వచ్చాయన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News