by సూర్య | Sat, Jun 05, 2021, 01:34 PM
సూపర్ హిట్ మూవీ 'మిర్చి'లో ప్రభాస్ సరసన మెరిసిన అందాల భామ రిచా గంగోపాధ్యాయ తల్లి అయ్యారు.మే 27న తనకు మగబిడ్డ పుట్టాడని సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించారు.టాలీవుడ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను ప్రేమించి 2019లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది రిచా. వివాహమయ్యాక చాలా రోజులకు కానీ తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇక ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా సీక్రెట్ గా ఉంచిన రిచా.. ఇటీవల బేబీ బంప్ తో ఫోటోని చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. ఫిబ్రవరిలో తాను తల్లి కాబోతున్నట్టు తెలియజేసిన రిచా గంగోపాధ్యాయ.. ఇప్పుడు తనకు మగ బిడ్డ పుట్టినట్టు వెల్లడించారు.
Latest News