by సూర్య | Wed, Apr 07, 2021, 12:28 PM
అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి చేస్తున్న చిత్రం "పుష్ప". క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రం కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే తాజాగా 'పుష్ప' టీం ఇచ్చిన మరో అప్డేట్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా కోసం ఆస్కార్ అవార్డును అందుకున్న సౌండ్ డిజైనర్ రేసుల్ పూకుట్టిని రంగంలోకి దింపుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. 'పుష్ప'ను పాన్ ఇండియా మూవీ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం. కన్నడ భాషల్లో భారీ రేంజ్ లో విడుదల చేయనున్నారు. పుష్ప' లోని హీరో పుష్పరాజ్ కు చెందిన ప్రీలూడ్ ఇప్పటికే రిలీజ్ అయ్యి అందరినీ అట్రాక్ట్ చేసింది.
Latest News