by సూర్య | Wed, Mar 31, 2021, 10:50 AM
సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రెజినా కసాండ్రా.తమిళ్ పొన్ను అయిన ఈ భామ తెలుగులో ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ టైంలోనే మంచి ఫేం సొంతం చేసుకుంది.కుర్ర హీరోలకి జోడీగా వరుస అవకాశాలు సొంతం చేసుకుంది.దీంతో రెజినా స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు.ఇటు నటన, అటు గ్లామర్ తో మెప్పించే ఈ అమ్మడుకి టాలీవుడ్ దర్శక, నిర్మాతలు కూడా భాగానే అవకాశాలు ఇచ్చారు.అయితే ఎందుకనో ఈ భామకి క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.
దీంతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో సెవెన్ సినిమాలో నటించింది.ఈ సినిమాలో ఆమె విలనీగా తన పెర్ఫార్మెన్స్ తో ఆధారగొట్టింది.అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.తరువాత అడవి శేష్ తో కలిసి ఎవరు అనే సినిమాలో నటించింది.ఆమె నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ వాయిదా పడడం వలన తాజాగా ఓ వాటర్ స్పోర్ట్స్ గేమ్ రేస్లో పాల్గొని ప్రైజ్ గెలుచుకుంది.ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా తెలిపింది రెజీనా.
ఈ ఆదివారం నాడు చెన్నైలో స్టాండప్ పడిల్ రేసులో పాల్గొన్నా.నిజానికి ఆరోజు నేను చెన్నైలో ఉండాల్సింది కాదు.తాను నటిస్తున్న సినిమా షూటింగ్ వాయిదా పడడం వలన ఇంటికి వచ్చాను.దీంతో ఏదో సరదాగా నా ఫ్రెండ్స్తో ఈ ఆటలో పాల్గొన్నాను.మొత్తానికి రేస్లో విన్నర్గా నిలిచాను అంటూ రాసుకొచ్చింది రెజీనా
Latest News