సురేఖా వాణి కామెంట్స్ ఎవరిని ఉద్దేశించో.?

by సూర్య | Tue, Mar 30, 2021, 09:20 AM

నటి సురేఖా వాణి టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన ఆమెకి ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు రావడం లేదు. వెండితెరపై ఎంతో పద్దతిగా కనిపించే సురేఖా వాణి.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఇక ఆమె కూతురు సుప్రీతతో కలిసి చేసే సందడి మాములుగా ఉండదు. త్వరలోనే సుప్రీత సినీ రంగ ప్రావెన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన తల్లిపై, తనపై వచ్చే గాసిప్స్ పై సుప్రీత ఫైర్ అవుతూ ఉంటుంది. ఆ మధ్య సురేఖా వాణి రెండో పెళ్లికి సంబంధించి వచ్చిన వార్తలపై సుప్రీత ఓ రేంజ్ లో మండిపడింది. మీడియాపై కౌంటర్లు కూడా వేసింది. ఇక తాజాగా సురేఖా వాణి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె నకిలీ మనుషులను, అబద్ధపు ప్రామిస్ లను నమ్మకండి..


అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలను ఉద్దేశించి సురేఖా వాణి ఈ కామెంట్స్ చేసి ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


 


 

Latest News
 
బుక్ మై షోలో 'స్త్రీ2' సెన్సేషన్ Fri, Apr 26, 2024, 06:39 PM
కేరళలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' Fri, Apr 26, 2024, 06:30 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వం' Fri, Apr 26, 2024, 06:13 PM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 26, 2024, 06:09 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ కి టైమ్ లాక్ Fri, Apr 26, 2024, 06:04 PM