by సూర్య | Thu, Mar 25, 2021, 05:04 PM
మహేష్ బాబు 'గీత గోవిందం' మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ 'సర్కారు వారి పాట' మూవీ చేస్తున్నారు. ఈ మూవీ దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుని , తదుపరి షూటింగ్ షెడ్యూల్ కై సిద్ధమవుతుంది. అయితే హీరో మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మంచి విషయాలకు స్పందిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సతీమణి నమ్రత, మహేష్ బాబు కు సంబంధించిన ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. నమ్రత ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తున్న మహేష్ బాబు లేటెస్ట్ ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Latest News