by సూర్య | Thu, Mar 25, 2021, 05:21 PM
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ముంబైకి చెందిన గంగూబాయ్ జీవితం ఆధారంగా ‘గంగూభాయ్ కతియావాడీ’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ ముంబై రెడ్ లైట్ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూ తిరగనుంది. ఈ సినిమా కథాంశం తన తల్లిని కించపరిచేలా ఉందని గంగూబాయ్ దత్తపుత్రుల్లో ఒకరైన బాబూజీ రాజీ షా కోర్టులో పిటిషన్ వేశారు. సినిమా స్టోరీ తన తల్లి గోప్యత హక్కును హరించేలా ఉందని షా తన పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన కోర్టు..ఆలియా భట్, దర్శకుడు భన్సాలీతో పాటు మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబైఅనే పుస్తకాన్ని రచించిన హుస్సేన్ జైదీలకు సమన్లు జారీ చేసింది. దీనిపై మార్చి 21 లోగా సమాధానం చెప్పాలని ముంబై కోర్టు ఆదేశించింది.
Latest News