ఆలియా భట్ కు షాకిచ్చిన ముంబై కోర్టు

by సూర్య | Thu, Mar 25, 2021, 05:21 PM

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌, దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ముంబైకి చెందిన గంగూబాయ్‌ జీవితం ఆధారంగా ‘గంగూభాయ్‌ కతియావాడీ’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ ముంబై రెడ్‌ లైట్‌ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూ తిరగనుంది. ఈ సినిమా కథాంశం తన తల్లిని కించపరిచేలా ఉందని గంగూబాయ్‌ దత్తపుత్రుల్లో ఒకరైన బాబూజీ రాజీ షా కోర్టులో పిటిషన్ వేశారు. సినిమా స్టోరీ తన తల్లి గోప్యత హక్కును హరించేలా ఉందని షా తన పిటిషన్ ‌లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన కోర్టు..ఆలియా భట్‌, దర్శకుడు భన్సాలీతో పాటు మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబైఅనే పుస్తకాన్ని రచించిన హుస్సేన్‌ జైదీలకు సమన్లు జారీ చేసింది. దీనిపై మార్చి 21 లోగా సమాధానం చెప్పాలని ముంబై కోర్టు ఆదేశించింది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM