by సూర్య | Wed, Jan 06, 2021, 02:38 PM
బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ ఇన్ స్టా గ్రామ్ ను హ్యాక్ చేశారట హ్యాకర్లు. ఫిర్యాదు అందుకున్న ముంబై సైబర్ పోలీసుల బృందం కేవలం గంటలోనే దాన్ని తిరిగి అదుపులోకి తీసుకొచ్చారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను క్లిక్ చేయగా హ్యాకింగ్ చేసినట్లుగా తనకు సమాచారం వచ్చిందని, ఖాతాలో ఉన్న సమాచారం కనిపించడం లేదంటూ అమీషా పటేల్.. ముంబై సైబర్ సెల్లో ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన లింక్ను క్లిక్ చేయగా మరో నకిలీ సైట్కు చేరుతున్నదని, తన ఖాతాపై తనకు నియంత్రణ లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో రంగంలోకి దిగిన సైబర్ సెల్ పోలీసులు.. ఇన్స్టాగ్రామ్ కాపీరైట్ ఉల్లంఘనగా అనుమానించి ఖాతాను కేవలం గంటల వ్యవధిలోనే తిరిగి తమ నియంత్రణలోకి తీసుకురాగలిగారు. అదేవిధంగా ఖాతాలో కనిపించకుండా పోయిన ఫొటోలు, ఇతర సమాచారాన్ని కూడా పునరుద్ధరించారు. హ్యాకింగ్కు గురైన సమాచారం నెదర్లాండ్స్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ లింక్ నెదర్లాండ్స్ యూఆర్ఎల్ నుంచి రాగా.. ఐపీ చిరునామా ప్రదేశం టర్కీలో ఉన్నట్లు కనుగొన్నారు. కాగా, నటుడు శరద్ కేల్కర్ కూడా తన ఖాతాపై నియంత్రణ కోల్పోయి సైబర్ సెల్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దాన్ని పరిష్కరించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Latest News