by సూర్య | Thu, Jan 07, 2021, 09:30 AM
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ముంబయి నుండి హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజుల షూటింగ్ నిమిత్తం పూరి హైదరాబాద్ వచ్చారని సమాచారం అందుతోంది. అది కూడా ఒక బుల్లి తెర కార్యక్రమం కోసం అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రముఖ ఛానెల్ కోసం పూరి జగన్నాద్ పర్యావరణంపై ఒక డాక్యుమెంటరీ తెరకెక్కించబోతున్నారు. దాని కోసం రెండు రోజుల పాటు చిత్రీకరణ చేయబోతున్నారు. ఈ డాక్యుమెంటరీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ తో మాట్లాడించడంతో పాటు పలువురు పర్యావరణ వేత్తలతో కూడా మాట్లాడించబోతున్నారని సమాచారం. ఈ డాక్యుమెంటరీ ఈ నెలాఖరున ఆ టీవీ ఛానెల్ లో ప్రసారం అవ్వబోతుందట.
Latest News