by సూర్య | Sun, Jan 03, 2021, 10:41 AM
తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి భాషల్లో వందలాది సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో ఒదిగిపోయిన కథానయిక శ్రీదేవి. ఈ అతిలోక సుందరి నటన, అందము, అభినయలతో సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అబ్బురపరిచే తన నలటనతో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానుల ఖాతాలో వేసుకుంది. ఈమె లేని లోటు ఎప్పటికీ భర్తీ కానిదనే చెప్పుకోవచ్చు. ఎంతో మంది నటీనటులకు శ్రీదేవే రోల్ మోడల్. ఆమె నటన ఓ అద్బుతం. అందుకే ఈ అతిలోక సుందరికీ అంత క్రేజ్. శ్రీదేవితో కలిసి నటించాలని అనుకోని వారెవరూ ఉండరేమో.
సౌత్ నుంచి ఉత్తారాది ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన శ్రీదేవి ఎప్పటికీ గుండెల్లో గుర్తుండి పోయే హీరోయిన్ గా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా శ్రీదేవి లేని లోటును ఆమె కుమార్తె తీరుస్తుందనే చెప్పుకోవచ్చు. శ్రీదేవి వారసురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ బ్యూటీ ఇప్పటికే హిందీలో చాలా తక్కువ సినిమాలే చేసినా తన అందం, నటనతో కుర్రకారు మనసును దోచుకుంది. అందుకే ఈ బ్యూటీకి టాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే జాన్వీ మాత్రం సౌత్ సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడంలేదని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ వెలుతోంది. కాగా బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఈ ముద్దుగుమ్మనే తన సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని ప్లాన్ వేశాడట.
బాక్సఫీస్ ను షేక్ చేసిన చత్రపతి సినిమాను బెల్లంబాబు హిందీలో రీమేక్ చేయబోతున్నాడన్న వార్త తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా నటించేందుకు జాన్వీ తో డిస్కషన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదండోయ్ ఈ ముద్దుగుమ్మ కూడా బెల్లంబాబు సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. ఎందుకంటే ఈ కుర్రదానికి అందులో నటించడానికి భారీ పారితోషికాన్ని కూడా ఆఫర్ చేశారట. అందులోనూ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా రీమేక్ కూడా హిందీలోనే.. దాంతో ఈ ముద్దుగుమ్మకు.. వసూలకు వసూలు.. పేరుకు పేరు రెండూ వస్తాయని ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో శ్రియ పాత్రను ఈ కుర్రది ఏ మేరకు రిప్లేస్ చేయగలదో లేదో అనేది వేచి చూడాలి.
Latest News