తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవర్ స్టార్

by సూర్య | Wed, Oct 21, 2020, 11:56 AM

హైదరాబాద్ ను గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. దీంతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ పిలుపుకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే చాలామంది విరాళాలు ఇచ్చారు. చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి రూపాయలు ప్రకటించారు. ఇక తాజాగా మరోసారి మానవతను చాటుకున్నారు జనసేన అధినేత, పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్. వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారాయన. వరద సహాయక చర్యల్లో జనసైనికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు పవన్. కాగా, తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖులంతా ముందుకు రావాలన్న సీఎం కేసీఆర్‌ పిలుపుతో. చాలా మంది స్పందిస్తున్నారు. కోట్ల రూపాయల విరాళం ప్రకటించి పెద్దమనసు చాటుకుంటున్నారు. వర్షాలతో సతమతమవుతున్న భాగ్యనగర ప్రజల్ని ఆదుకోవడానికి సినీతారలు కదిలివస్తున్నారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM