మరో రెండు గుండెలు మా కుటుంబంతో కలిశాయి : నమ్రత

by సూర్య | Sun, Oct 18, 2020, 03:15 PM

సూపర్‌స్టార్‌ మహేశ్‌ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ తన చేస్తున్న మంచి పనుల వల్ల హీరో అనిపించుకుంటున్నారు. పలు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్‌ చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్‌, లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్స్‌తో కలిసి మూడున్నరేళ్లలో వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్‌ చేయించడంలో మహేశ్ తన వంతు పాత్రను పోషించారు. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్స్ జరిగాయి. ఈ విషయాన్ని మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు "మరో రెండు గుండెలు మా కుటుంబంతో కలిశాయి. ఇటీవల గుండె ఆపరేషన్స్‌ చేయించుకున్న ఇద్దరు చిన్నారులు ఆరోగ్యం కుదుటపడుతుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. ఆంధ్రా హాస్పిటల్స్‌కు ధన్యవాదాలు" అన్నారు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM