రాజకీయ కక్షతోనే నాపై కేసులు పెడుతున్నారు :కత్తి కార్తీక

by సూర్య | Sun, Oct 18, 2020, 02:49 PM

యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీకతో పాటు ఆరుగురిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 52 ఎకరాల స్థలాన్ని రూ. 35 కోట్లకే ఇప్పిస్తామని చెప్పి... కోటి రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని మోసం చేశారంటూ వారిపై కేసు నమోదు చేశారు.


ఈ అంశంపై కత్తి కార్తీక స్పందించారు. తాను ఎవరినీ మోసం చేయలేదని చెప్పారు. రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెడుతున్నారని అన్నారు. కేసు పెట్టిన వ్యక్తికి రెండు నెలల క్రితమే లీగల్ నోటీసులు ఇచ్చామని... అలాంటప్పుడు హఠాత్తుగా తమపై చీటింగ్ కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ మధ్యనే తనను చంపుతామని బెదిరించారని... దీనికి సంబంధించి రామాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తే... ఇన్ని అడ్డంకులు సృష్టిస్తారా? అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాజకీయాలను వీడనని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ, దుబ్బాక ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని తెలిపారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM