ఆ హీరోయిన్ పేరుచెప్పి 13 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు...

by సూర్య | Wed, Oct 14, 2020, 12:41 PM

ప్రముఖ సినీ నటి ప్రణీత పేరుతో ఓ ముఠా చెలరేగిపోయింది. ఓ కంపెనీ యజమానిని రూ. 13.50 లక్షల మేర మోసం చేసింది. బెంగళూరులో జరిగిందీ ఘటన. ఈ నెల 6న చెన్నైకి చెందిన కొందరు వ్యక్తుల ముఠా బెంగళూరు వచ్చింది. అక్కడి ఓ హోటల్‌లో ఎస్‌వీ గ్రూప్ అండ్ డెవలపర్స్ కంపెనీ చైర్మన్ అమరనాథ్‌రెడ్డిని ఈ ముఠా కలిసింది. ముఠాలోని వర్ష అనే యువతి తాను ప్రణీత మేనేజర్‌నని అమరనాథ్‌రెడ్డిని నమ్మబలికింది.


ఎస్‌వీ గ్రూప్‌నకు ప్రచారకర్తగా ప్రణీతను కుదురుస్తామని, త్వరలోనే అగ్రిమెంట్ చేయిస్తానని చెప్పడంతో అమరనాథ్‌రెడ్డి సరేనన్నారు. ఒప్పందంలో భాగంగా ఆయన వారికి రూ.13.50 లక్షలు చెల్లించారు. డబ్బులు తీసుకుని వెళ్లిన తర్వాత ముఠా నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని భావించిన అమరనాథ్‌రెడ్డి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM
బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్ Tue, Apr 30, 2024, 10:46 PM
ఓపెన్ అయ్యిన 'ఆ ఒక్కటి అడక్కు' బుకింగ్స్ Tue, Apr 30, 2024, 10:44 PM
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM