by సూర్య | Wed, Oct 07, 2020, 05:23 PM
బిగ్ బాస్ సీజన్ 4 లేటెస్ట్ ప్రోమో బుధవారం ఎపిసోడ్ ఎంత సీరియస్ గా ఉంటుందో తెలియచేస్తుంది. బిబి హోటల్ టాస్క్ లో భాగంగా హౌజ్ మేట్స్ లో కొందరిని గెస్టులుగా.. కొందరిని హోటల్ సిబ్బందిగా చేయమన్న బిగ్ బాస్ ఈ టాస్క్ లో గెస్టులను మెప్పించి హోటల్ సిబ్బంది స్టార్స్ గెలుచుకోవాలని చెప్పాడు. అయితే మంగళవారం ఎపిసోడ్ తో ఈ టాస్క్ మొదలవగా ఈ టాస్క్ లో గెస్టులుగా వచ్చిన మెహబూ రెచ్చిపోయినట్టు తెలుస్తుంది.
లేటెస్ట్ ప్రోమోలో మెహబూబ్ టెంప్ట్ అయ్యి టంగ్ స్లిప్ అయినట్టు తెలుస్తుంది. అఖిల్ తో మెహబూబ్ గొడవ కూడా ప్రోమోలో చూపిస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో అతను లేడనే కారణం చేతనే మెహబూబ్ అలా రెచ్చిపోతున్నాడని అనిపిస్తుంది. టాస్క్ లో రెచ్చిపోతే నాగార్జున గారు మెచ్చుకుంటున్నారని.. టాస్క్ బాగా ఆడాలని చెప్పడంతో మెహబూబ్ టాస్క్ లో సీరియస్ గా ఇన్వాల్వ్ అవుతున్నాడు.
కాని అక్కడ తను ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తను మాట్లాడే మాటలు బయట ఆడియెన్స్ కు ఎలా వెళ్తున్నాయన్నది అర్ధం చేసుకోవాలి. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో చూస్తే నీ రౌడీఇజం నీ ఊళ్ళి చేసుకో ఇది బిగ్ బాస్ హౌజ్ అని అవినాష్ అంటాడు. దానికి మెహబూబ్ కూడా ఇక్కడే చూపిస్తా అంటాడు. మొత్తానికి ఇప్పటివరకు మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మెహబూబ్ సడెన్ గా సొహెల్ రూట్ లోకి వెళ్లడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.
Latest News