by సూర్య | Sat, Apr 04, 2020, 11:14 AM
అనుపమ పరమేశ్వరన్కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. 'అ ఆ' సినిమాలో అనుపమ గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ ఈ మలయాళీ కుట్టి. కాగా ఆ మధ్య ఈ భామ నటించిన సినిమాలు పెద్దగా అలరించలేకపోవడంతో కొంత వెనుకబడ్డది. అయినా వచ్చిన అవకాశాల్నీ వదలుకోకుండా అదరగొడుతూనే ఉంది. అనుపమ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు మేనల్లుడు అశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రంలో అనుపమ హీరోయిన్గా చేసేందుకు గ్రీన్సిగల్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి రూపొందిస్తున్నాడు. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాతో పాటు మరో సినిమాలో అనుపమకు అవకాశం వచ్చింది.ఉమెన్ ఒరియెంటెడ్ కథతో వస్తోన్న ఈ సినిమాలో కథ అంతా కూడా ఆమె చుట్టూనే తిరుగుతుందట. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా హనుమాన్ చౌదరి పరిచయం కానున్నాడు. గతంలో ఆయన రవిబాబు దగ్గర దర్శకత్వ శాఖలో 'అవును' సినిమాకి పనిచేశాడు. ఈ సినిమా తమిళ తెలుగు భాషాల్లో తెరకెక్కనుందట. కాగా అనుపమ చివరిసారిగా తెలుగులో కనిపించిన సినిమా 'రాక్షసుడు'. ఈ సినిమా మంచి విజయం సాధించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన ఈ సినిమాలో టీచర్ పాత్ర చేసిన అనుపమ తన నటనతో అందరిని ఆకట్టుకుంది.
Latest News