మహేష్ -బన్నీ సినిమాలతో ఫ్యాన్స్ కన్యూజ్ అవుతున్నారా?

by సూర్య | Fri, Jan 17, 2020, 04:16 PM

ఈ సంక్రాంతికి  జనవరి 11 న సరిలేరు నీకెవ్వరూ విడుదల కాగా..జనవరి 12 న అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో విడుదల అయ్యింది. ఇక దేశ వ్యాప్తం గా కూడా ఈ రెండు చిత్రాలు తమ సత్తా చాటుతూ వార్తల్లో నిలుస్తున్నాయి.  సంక్రాంతి హీరోలు మహేష్ బన్నీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తుంది. విడుదలకు ముందు థియేటర్స్, డేట్స్ విషయంలో మొదలైన విభేదాలు విడుదల తరువాత కూడా కొనసాగుతున్నాయి. మేము గొప్పంటే మేమంటూ…గొడవపడుతున్నారు. నిజానికి మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, బన్నీ నటించిన అల వైకుంఠపురంలో చిత్రాలు రెండింటికీ పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే పండుగ సీజన్ కావడంతో రెండు సినిమాలను ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. కానీ రికార్డులు, మరియు కలెక్షన్స్ విషయంలో ఒకరికి మించి ఒకరు పోస్టర్స్ వదులుతున్నారు. ముఖ్యంగా నాన్ భాహుబలి రికార్డ్స్ మావంటే..మావంటూ ఇద్దరు పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. దీనితో అసలు నాన్ బాహుబలి రికార్డ్స్ ఎవరివి అనేవి ప్రేక్షకులకు అంతు చిక్కడం లేదు. రెండు చిత్రాలు ప్రేక్షకులకు నచ్చాయి అన్నది నిజం. ఈ నేపథ్యంలో ఈ కలెక్షన్స్ వార్ వలన ఆడియన్స్ కి సినిమాల పట్ల గౌరవం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ హీరోలు ఇద్దరూ నాన్ బాహుబలి వార్ వదిలేస్తే మంచిది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM