కొరియన్‌ సినిమా రీమేక్ ఫై కన్నేసిన సురేష్ బాబు!

by సూర్య | Tue, Jan 14, 2020, 04:58 PM

 సురేష్ ప్రొడక్షన్ సంస్థ మళ్లీ వరుస సినిమాలను నిర్మిస్తూ బిజీ అయ్యింది. రీసెంట్ గా వెంకిమామ తో సూపర్ హిట్ అందుకున్న సురేష్ బాబు..తాజాగా కొరియన్‌ సినిమా రీమేక్ ఫై కన్నేసినట్లు సమాచారం. పోలీసుల ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు యువకుల కథతో తెరకెక్కిన మిడ్‌ నైట్‌ రన్నర్స్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పోలీష్ అకాడమీలో ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు యువకులు అత్యుత్సాహంతో ఓ కిడ్నాప్ కేసును పరిష్కరించేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడటం అనేది ఈ సినిమా కథ. ఒరిజినల్‌ వర్షన్లో ఇద్దరు కుర్రాలు ఉంటే తెలుగు రీమేక్‌లో ఇద్దరు అమ్మాయిలు తో చేయాలనీ చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ప్రధాన పాత్రలకు రెజీనా, నివేదా థామస్‌ల పేర్లను పరిశీలిస్తున్నారట. అలాగే ఈ సినిమాకు సుధీర్‌ వర్మ అయితే దర్శకుడిగా బాగా సెట్ అవుతాడని అనుకుంటున్నారట. త్వరలోనే దీనిలో అధికారిక ప్రకటన రానుంది.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM