by సూర్య | Mon, Jan 13, 2020, 02:17 PM
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ చిత్రం దూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ నటి కైరా అద్వానీని ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ కలసి 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించారు. మరోసారి చరణ్ సరసన కైరా మెరవనుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది ఆ చిత్ర దర్శక..నిర్మాతలు నోరు విప్పితే తప్ప తెలియదు.
Latest News