by సూర్య | Thu, Oct 10, 2019, 10:48 PM
`సైరా నరసింహారెడ్డి` అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ను సుబ్బిరామిరెడ్డి మెగాస్టార్ చిరంజీవిని `సైరా` బృందాన్ని సన్మానించి అభినందించారు. పార్క్ హయత్లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ..`150 చిత్రాలు చేసిన చిరంజీవికి అవన్నీ ఒక ఎత్తయితే 151వ సినిమా ‘సైరా’ మరో ఎత్తు. బ్రిటీషువారిని గడగడలాడించిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను తీసుకుని తన సత్తా ఏంటో భారతదేశానికి చిరంజీవి చాటిచెప్పారు. ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. చిరంజీవి అలాంటి సాహసం చేసి సక్సెస్ అయ్యారు. ఇలాంటి భారీ సినిమాను రామ్ చరణ్ లాంటి కుర్రాడు నిర్మించాడంటే ఆశ్చర్యం కలుగకమానదని అన్నారు.
Latest News