చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

by సూర్య | Mon, Aug 15, 2022, 09:17 PM

యావన్మంది స్వాతంత్ర్య సమరయోధుల కృషి, త్యాగఫలితమే మనకు ఈ స్వాతంత్ర్య దినోత్సవ అదృష్టం కలిగిందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన మాతృమూర్తి అంజనా దేవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి సోదరి డాక్టర్ మాధవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజనా దేవి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు, ట్రస్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతిపతి మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. 


జెండా వందనం అనంతరం చిరంజీవి ప్రసంగించారు. 75 వసంతాల స్వతంత్ర భారతావని వజ్రోత్సవాలు జరుపుకుంటోందని, ఈ ఉత్సవాలు జరుపుకోవడం మనందరి అదృష్టం అని భావిస్తున్నట్టు తెలిపారు. యావన్మంది స్వాతంత్ర్య సమరయోధుల కృషి, త్యాగఫలితమే మనకు ఈ అదృష్టం కలిగిందని వివరించారు. 


స్వాతంత్ర్య సమరయోధులను కన్న తల్లులను ఈ సందర్భంగా స్మరించుకోవాలని చిరంజీవి అన్నారు. స్వాతంత్ర్య సమరంలోకి వెళ్లండి అంటూ వారు తమ బిడ్డలను ధైర్యంగా పంపించారని, అలాంటి మాతృమూర్తుల త్యాగనిరతిని ఈ సందర్భంగా మనందరం స్మరించుకోవడం సబబుగా ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే తన తల్లి అంజనాదేవితో జాతీయ పతాకావిష్కరణ చేయించడం జరిగిందని వెల్లడించారు.

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM