ముఖేశ్ అంబాని కుటుంభానికి బెదరింపులు...వ్యక్తి అరెస్ట్

by సూర్య | Mon, Aug 15, 2022, 09:16 PM

మనదేశ ప్రముఖ పారిశ్రామికవేత అయిన ముఖేశ్ అంబానికి, ఆయన కుటుంభానికి బెదరింపులు వచ్చాయి. ఈ మేరకు రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్ కి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. మొత్తం ఎనిమిది సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్ లో రిలయన్స్ ఫౌండేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఒకేరోజు ఎనిమిది కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ... రిలయన్స్ ఫౌండేషన్ నుంచి ఫిర్యాదు అందిందని చెప్పారు. మరోవైపు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై వెస్ట్ సబర్బ్ ప్రాంతంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ముఖేశ్ అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో నింపిన స్కార్పియో వాహనం పార్క్ చేసి ఉండటం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM