by సూర్య | Sat, Aug 06, 2022, 03:58 PM
2021-22 మద్యం విధానాన్ని అమలు చేయడంలో విఫలమైన అధికారులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ కమీషనర్ అరవ్ గోపి కృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమీషనర్ ఆనంద్ కుమార్ తివారిలతో పాటు ముగ్గురు అడ్హక్ అధికారులు, ఆరుగురు ఎక్సైజ్ శాఖ అధికారులపై సస్పెన్షన్ విధించారు. నూతన మద్యం విధానాన్ని అమలు చేయడంలో వీరు విఫలమైనట్లు గవర్నర్ ఆఫీసు పేర్కొంది.
Latest News