by సూర్య | Sat, Aug 06, 2022, 01:16 PM
పెదకాకాని: మండలంలోని నంబూరులో రేషన్ బియ్యం నిల్వలని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మేడ భాగ్యలక్ష్మి, తోకల రమణ ఇళ్ల వెంట బియ్యం కొనుగోలు చేసి సుమారు 7. 5 క్వింటాళ్లను నంబూరులో నిల్వ చేశారు. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.
Latest News