ఈ నెలలో రయ్...రయ్ అంటూ ఈ బైకులు రానున్నాయ్

by సూర్య | Sat, Aug 06, 2022, 03:28 AM

తాజాగా మార్కెట్ లోకి స్మార్ట్ ఫోన్ల రాకనే కాదు రోడ్డుపై రయ్..రయ్ అనేందుకు అనేక నూతన ఆవిష్కరణ బైక్ లు రాబోతున్నాయి. భారత్ మార్కెట్లో ఈ ఆగస్టులో కొత్త బైకులు సందడి చేయనున్నాయి. పలు ద్విచక్రవాహన తయారీ దిగ్గజాలు తమ నూతన మోడళ్లను ఈ నెలలోనే విడుదల చేస్తున్నాయి. టీవీఎస్ రోనిన్, బజాజ్ పల్సర్ ఎన్160, రాయల్ ఎన్ ఫీల్డ్ న్యూ బుల్లెట్, హంటర్ బైకులు, హోండా బిగ్ వింగ్, హీరో ఎక్స్ పల్స్ 200టీ, హార్లే డేవిడ్సన్ నైట్ స్టర్, డుకాటి స్ట్రీట్ ఫైటర్ వీ2, డుకాటీ పనిగేల్ వీ4 బైక్ లు భారత రోడ్లపై పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉన్నాయి. 


ఇవేకాకుండా జోంటెస్, మోటో మారిని కంపెనీల బైకులు కూడా భారత మార్కెట్లో సత్తా చాటేందుకు వస్తున్నాయి. జోంటెస్, మోటో మారిని కంపెనీల బైకులు భారత్ కు పూర్తిగా కొత్త. జోంటెస్ కు చెందిన ఐదు మోడళ్ల బైకులు అన్నీ 350 సీసీ సెగ్మెంట్ కు చెందినవే. భారత్ లో బెనెల్లీ, కీవే బైకులను ప్రవేశపెట్టిన ఆరీ సంస్థతో భాగస్వామ్యం ద్వారా ఈ బైకులు భారత్ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఇక మోటో మారిని నాలుగు మోడళ్లను తీసుకువస్తుండగా, అన్నీ కూడా 650 సీసీ ట్విన్ సిలిండర్ ప్లాట్ ఫాంపై తయారైనవే.

Latest News

 
తెటుపురంలో బైక్ భారీ ర్యాలీ Tue, May 07, 2024, 05:04 PM
ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగితే చర్యలు Tue, May 07, 2024, 05:03 PM
బహుజనులకు రాజ్యాధికారం బీఎస్పీ లక్ష్యం:ధరణికోట Tue, May 07, 2024, 05:01 PM
మహిళా సాధికారత వైసీపీతోనే సాధ్యం Tue, May 07, 2024, 04:59 PM
విజయనగర సామ్రాజ్య స్థాపనలో కురుబల పాత్ర అత్యంత కీలకం Tue, May 07, 2024, 04:54 PM