అర్పిత ముఖర్జీ పేరిట ఇన్సురేన్స్ పాలసీలు...అన్నింటికీ నామినీ ఆయనే

by సూర్య | Sat, Aug 06, 2022, 03:27 AM

అర్పిత ముఖర్జీ పేరిట భారీ సంఖ్యలో బీమా పాలసీలు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అర్పిత ముఖర్జీకి చెందిన 31 బీమా పాలసీల్లో నామినీగా అన్నింట్లోనూ పార్థ ఛటర్జీ పేరే ఉందని ఈడీ వెల్లడించింది.  పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసిన టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఈడీ అదుపులో ఉన్న పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలకు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. ఇదిలావుంటే తమ అదుపులో ఉన్న నిందితులు కొన్ని ఆస్తులను నగదు రూపంలోనూ కొనుగోలు చేశారని ఈడీ వివరించింది. అయితే ఆ ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాన్ని వెలికితీయాల్సి ఉందని అభిప్రాయపడింది. 


అంతేకాదు, అర్పిత ముఖర్జీ నివాసంలో జరిపిన సోదాల్లో... బోల్పూర్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన ఓ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన కన్వేయన్స్ డీడ్ పత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. ఇది 2012 నాటిదని, దీన్నిబట్టి పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీ మధ్య ఆర్థిక, భూ సంబంధ లావాదేవీలు గత పదేళ్లుగా సాగుతున్నాయని అర్థమవుతోందని ఈడీ పేర్కొంది.

Latest News

 
వైభవంగా శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు Sun, May 19, 2024, 06:18 PM
రాజ‌కీయాల‌కు అతీతంగా అంబ‌టి రాంబాబు ట్వీట్‌ Sun, May 19, 2024, 06:11 PM
ఏపీ ప్రధాన పార్టీ అధ్యక్షుల ఫ్యామిలీ టూర్స్ Sun, May 19, 2024, 06:08 PM
ఏపీలో టీడీపీదే అధికారం: చింతా మోహన్ Sun, May 19, 2024, 05:57 PM
రానున్న మూడు రోజులు భారీ వర్షాలు Sun, May 19, 2024, 05:52 PM