నాకు భద్రతా కల్పించేలా రాష్ట్రానికి ఆదేశించండి: రఘురామకృష్ణరాజు

by సూర్య | Thu, Jun 23, 2022, 02:56 AM

తన నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉందని, ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు తనకు అవసరమైనంత భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర హోంశాఖను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆయన కలిశారు. ప్రధాని మోదీ వచ్చే నెల 4వ తేదీన తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని... ఆ సందర్భంగా తాను వెళ్లాల్సి ఉందని వారికి చెప్పారు. తనకు అవసరమైనంత భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నిన్న విశాఖపట్నంలో జరిగిన మీటింగ్ కు వెళ్లాలనుకుంటే రానివ్వలేదని చెప్పారు. నేర చరిత్ర ఉన్నవాళ్లు ముఖ్యమంత్రి అవుతారని అంబేద్కర్ ముందే ఊహించలేదని అన్నారు.

Latest News

 
తన పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ Thu, Jun 08, 2023, 10:45 PM
వాయిదా పడిన సీఎం జగన్‌ గుడివాడ పర్యటన Thu, Jun 08, 2023, 10:08 PM
ఏపీ సీఎం జగన్‌ కీలక నిర్ణయం Thu, Jun 08, 2023, 10:02 PM
నేడు సీఎం జగన్ ను కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు Thu, Jun 08, 2023, 09:26 PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ8గా ఎంపీ అవినాష్ రెడ్డి Thu, Jun 08, 2023, 09:21 PM