సోనియా గాంధీ విజ్ఞ‌ప్తికి ఒకే చెప్పిన ఈడీ

by సూర్య | Wed, Jun 22, 2022, 11:59 PM

విచారణకు గడువు కోరుతూ సోనియా గాంధీ చేసిన విజ్ఞ‌ప్తికి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ కూడా సానుకూలంగానే స్పందించింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌మ‌న్లు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ)కి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ బుధ‌వారం ఓ లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జీ అయినా... ఇంకా పూర్తిగా కోలుకోలేద‌ని, ఈ కార‌ణంగా బుధ‌వారం విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని సోనియా గాంధీ స‌ద‌రు లేఖ‌లో ఈడీకి తెలిపిన సంగ‌తి తెలిసిందే. 


సోనియా విజ్ఞ‌ప్తికి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ కూడా సానుకూలంగానే స్పందించింది. సోనియా గాంధీ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బుధ‌వారం నాటి విచార‌ణ‌కు ఆమె రాలేక‌పోతున్న‌ట్లు తెలిపిన లేఖ‌ను అంగీక‌రించిన ద‌ర్యాప్తు సంస్థ‌... కొత్త తేదీల‌తో మ‌రోమారు ఆమెకు స‌మ‌న్లు జారీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. గ‌తంలో జారీ చేసిన స‌మ‌న్ల మేర‌కు ఈడీ విచార‌ణ‌కు బుధ‌వారం సోనియా హాజ‌రు కావాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే.

Latest News

 
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM
సీనియర్ వైసీపీ నాయకుడు శెట్టూరు అబ్దుల్లా టీడీపీలో చేరిక Thu, May 02, 2024, 01:57 PM
కదిరిలో రూ.లక్ష నగదు స్వాధీనం Thu, May 02, 2024, 01:55 PM
న్యాయం, ధర్మం వైపు ప్రజలు నిలబడాలి: షర్మిల Thu, May 02, 2024, 01:54 PM
టిప్పు సుల్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం Thu, May 02, 2024, 01:51 PM