అగ్నిపథ్ కు వ్యతిరేక నిరసనలన్నీ అర్థరహితం: బాబా రామ్ దేవ్

by సూర్య | Thu, Jun 23, 2022, 12:02 AM

నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను అధికారానికి దూరం చేసే ఉద్దేశంతో కొందరు పన్నుతున్న కుట్రలని యోగా గురువు రామ్ దేవ్ బాబా ఆరోపించారు. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలకు ఎలాంటి అర్థం లేదని ఆయన విమర్శించారు. అవి ప్రధాని ఢిల్లీ యూనివర్సిటీలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


‘‘ఒకవేళ ఆందోళనకారులు యోగా చేసి ఉంటే.. వాళ్లు ఇలాంటి కుట్రపూరిత ఆందోళనలకు పాల్పడి ఉండేవారు కాదు. ఆందోళనకారులంతా యోగా చేయాలి. అగ్నిపథ్ కు వ్యతిరేక నిరసనలన్నీ అర్థరహితం. దేశంలో అరాచకం సృష్టించి ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అధికారానికి దూరం చేయాలనే ఎజెండాతో కొన్ని శక్తులు ఈ ఆందోళనలకు పాల్పడుతున్నాయి..” అని రామ్ దేవ్ బాబా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో యోగా ఉండవచ్చని.. కానీ యోగాలో రాజకీయం ఉండకూడదని పేర్కొన్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM