భారీ ఆఫర్లతో భారతీయ ఇన్వేస్టర్లకు...స్కామర్లు వల..ఏకంగా రూ.1000 కోట్ల మోసం

by సూర్య | Wed, Jun 22, 2022, 02:25 PM

మనం ఎంత అప్రమత్తతో ఉన్నా స్కామర్లు భారిన మనకు తెలియకుండానే పడుతున్నాం. తాజాగా ఇలాంటి స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. భారత ఇన్వెస్టర్లు క్రిప్టో స్కామ్‌లలో ఇరుక్కుని ఏకంగా రూ.1000 కోట్లకు పైగా నగదును కోల్పోయారు. ఈ విషయాన్ని క్లౌడ్‌సెక్ రిపోర్టు వెల్లడించింది. క్లౌడ్‌సెక్ అనేది భారత్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ. నకిలీ క్రిప్టో ఎక్స్చేంజ్‌లను క్రియేట్ చేసిన స్కామర్లు, భారత ఇన్వెస్టర్లకు ఎర వేశారు. తమ ప్లాట్‌ఫామ్‌ను సందర్శిస్తే.. వెల్‌కమ్ ఆఫర్ కింద 100 డాలర్ల క్రెడిట్ నోటును ఇస్తామని తెలిపారు. యూజర్ల నుంచి నమ్మకం పొందేందుకు ఈ ఆఫర్లను ఇన్వెస్టర్ల అకౌంట్లలో క్రెడిట్ కూడా చేశారు. దీంతో ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డబ్బులొస్తున్నాయని భావించిన ఇన్వెస్టర్లు వీటిల్లో మరిన్ని ఫండ్స్‌ను పెట్టారు. ఆ తర్వాత స్కామర్లు తమ అసలు రంగును బయటపెట్టారు.


ఈ స్కామ్‌లు కేవలం భారత్‌కే పరిమితం కాలేదని, గత వారం అమెరికాలో కూడా ఇలాంటి స్కామ్‌లు వెలుగులోకి వచ్చినట్టు తెలిపారు. లింక్డిన్‌ల ద్వారా కూడా స్కామ్‌లు జరుగుతున్నట్టు గుర్తించినట్టు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ సీన్ రేగాన్ చెప్పారు. క్రిప్టో స్కామ్‌ల ద్వారా ఒక్కో వ్యక్తి అమెరికాలో రూ.12.5 కోట్లను నష్టపోయినట్టు రేగాన్ చెప్పారు.


యూజర్లు ఆ ప్లాట్‌ఫామ్‌లలో డబ్బులు పెట్టిన తర్వాత.. వీరు ఈ నకిలీ ప్లాట్‌ఫామ్ నుంచి యూజర్లు విత్ డ్రా లేదా ట్రేడింగ్ జరుపుకునేందుకు వీలు లేకుండా చేశారు. కొన్ని నెలల పాటు యూజర్ల నమ్మకాన్ని చూరగొని, ఆ తర్వాత వారి సొంతం మనీని వారే విత్ డ్రా చేసుకోకుండా చేస్తున్నారని క్లౌడ్‌సెక్ తెలిపింది. మే 27న ముంబై పోలీసులు జగ్‌దీష్ లడి అనే గ్రాడ్యుయేట్ స్కూడెంట్‌ను అరెస్ట్ చేశారు. ఇతను రూ.1.5 కోట్లకు పైగా క్రిప్టో స్కామ్‌కి పాల్పడ్డాడు.


చాలా మంది యూజర్లకు 25 శాతం వరకు రిటర్నులను ఇస్తామని నమ్మించి, స్కామర్లు మోసం చేశారని ఓ ఇంగ్లీష్ మీడియా రిపోర్టు చేసింది. చట్టబద్ధమైన సైట్‌గా వచ్చిన ఒక నకిలీ క్రిప్టో ఎక్స్చేంజ్ ముంబైకి చెందిన ఒక వ్యక్తి నుంచి రూ.1.57 కోట్లను దొంగలించింది. తొలుత ఈ ఎక్స్చేంజీ కూడా యూజర్ల నమ్మకాన్ని పొంది, ఆ తర్వాత వారు మనీని విత్ డ్రా చేసుకోకుండా చేసింది. ఇలాంటి క్రిప్టో స్కామ్‌లు కోకొల్లలు.

Latest News

 
200 కుటుంబాలు టిడిపిలో చేరిక Sat, May 04, 2024, 12:28 PM
విజయవాడ కనకదుర్గ గుడిలో అధికారి రాసలీలలు Sat, May 04, 2024, 12:10 PM
కమలాపురం పరిధిలో ఏపీఎస్పీ బలగాలతో పోలీసుల కవాతు Sat, May 04, 2024, 12:09 PM
ఎమ్మెల్యేగా గెలిస్తే సాగు, తాగునీరు అందిస్తాం Sat, May 04, 2024, 11:44 AM
నేడు హిందూపురంలో పర్యటించనున్న సీఎం జగన్ Sat, May 04, 2024, 10:45 AM