దాచేప‌ల్లి సిమెంట్ ప్లాంట్ విస్త‌ర‌ణ...ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

by సూర్య | Wed, Jun 22, 2022, 01:20 AM

శ్రీ సిమెంట్ లిమిటెడ్‌ తన ప్లాంట్ విస్తరించేందుకు గానూ ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఇప్ప‌టికే సిమెంట్ త‌యారీ ప్లాంట్‌ను క‌లిగి ఉన్న శ్రీ సిమెంట్ లిమిటెడ్‌ తాజాగా రాష్ట్రంలో మ‌రో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప‌ల్నాడు జిల్లా ప‌రిధిలోని దాచేప‌ల్లిలో ఇప్ప‌టికే ఆ సంస్థ‌కు ఓ సిమెంట్ త‌యారీ యూనిట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ ప్లాంట్‌ను భారీ ఎత్తున విస్త‌రించేందుకు శ్రీ సిమెంట్ ప్ర‌తిపాదించ‌గా... అందుకు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి తెలిపింది. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావ‌డంతో ఏపీలో త‌న తాజా పెట్టుబ‌డుల‌కు సంబంధించి శ్రీ సిమెంట్ మంగ‌ళవారం ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం దాచేప‌ల్లి ప్లాంట్ విస్త‌ర‌ణ కోసం శ్రీ సిమెంట్ ఏకంగా రూ.2,500 కోట్ల మేర పెట్టుబ‌డి పెట్ట‌నుంది.

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM