భద్రతా దళాల తూటాలకు...నెలకొరిగిన ఉగ్రవాదులు

by సూర్య | Wed, Jun 22, 2022, 01:21 AM

కశ్మీర్ లో భద్రతా దళాలు ఉగ్రవాదుల భరతంపడుతున్నాయి. గత మూడ్రోజులుగా నిత్యం కశ్మీర్ లోయలో తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతంలో భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ మూడు రోజుల్లోనే భారత జవాన్లు 11 మంది ఉగ్రవాదలను అంతమొందించారు.  


జమ్మూ కశ్మీర్ లో భారత జవాన్లు మరోసారి ఉగ్రవాదుల పనిబట్టారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యుడి సహా నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరణించిన జైషే ఉగ్రవాదిని మజీద్ నాజిర్ గా గుర్తించారు. ఇటీవల ఫరూక్ మీర్ అనే పోలీసు అధికారిని చంపిన ఘటనకు అతడే బాధ్యుడని భావిస్తున్నారు. భారత భద్రతా బలగాలు ఇవాళ కశ్మీర్లో వేర్వేరు ఎన్ కౌంటర్లు జరిపాయి. పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో ఈ టెర్రరిస్టులు హతమయ్యారు. 

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM