by సూర్య | Sun, May 22, 2022, 12:59 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కొరకు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం జగన్ ఇదంతా భూటకపు యాత్ర, నిజమైతే ఒక్కరి దగ్గర ఐన పాస్ పుస్తకం చూపించమని అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. దేనికి ప్రతిస్పందనగా ... జనసేన రైతు భరోసా యాత్ర విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో అది చూసి ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి విమర్శలు చెయ్యడం హాస్యాస్పదంగా ఉందని, కౌలు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండవనే సంగతి కూడా తెలియదా అని పామర్రు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ నరేష్ సిఎం జగన్ని ప్రశ్నించారు.
Latest News