తాడేపల్లి పెద్ద తలకాయలను అందర్నీ అరెస్ట్ చేయాలి

by సూర్య | Sun, May 22, 2022, 01:00 PM

ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ , డ్రైవర్ మరణం  కొన్ని రోజులు నుండి వివాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఫోరెన్సిక్ ఫలితాలు వచ్చాక కేసు ముందుకు తీసుకువెళ్తామా అని పోలీస్ వారు ఇప్పటికే చెప్పియున్నారు. ఐతే తాజాగా ఆ ఫలితాలు రావడం, ఇది హత్య అని నిర్ధారించడం జరిగింది. దీనిపై స్పందించిన టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.... హంతకుణ్ణి పట్టుకోండి అంటే పరామర్శకు వచ్చిన మా దళిత నాయకులను కొట్టారు. హంతకుణ్ణి మూడురోజులుగా కాపాడుతున్న తాడేపల్లి పెద్ద తలకాయలను అందర్నీ అరెస్ట్ చేయాలి. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన జగన్ రెడ్డికి నైతికంగా ఇక పాలించే హక్కు లేదు. ఈ కాలకేయ హంతకుల ముఠాని జనమే తరిమి తరిమి కొట్టాలి. సజ్జల, అతని సిబ్బంది ఫోన్ కాల్ డేటా తీయాలి. హంతకుణ్ణి తప్పించడంలో ప్రధాన పాత్ర తాడేపల్లి కొంపదే. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. శవాన్ని తెచ్చి వదిలేసి పోయిన వైసీపీ MLC ని మూడు రోజులుగా కనీసం విచారించని ఏపీ పోలీసులపై, వాళ్ళ బాసులపై మాకిక నమ్మకం లేదు. CBI లేదంటే మరో వివేకా కేసవుతుంది అని సోషల్ మీడియా వేదికగా వాపోయారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM