by సూర్య | Sat, May 21, 2022, 03:11 PM
టమోటా లేనిది ఏ కూరాకు రుచిరాదు. అలాంటి టమెటాను తినాలంటే ప్రస్తుతం వంద సార్లు ఆలోచించాల్సి వస్తోంది. దీనికి కారణం టమాటా ధరకు ఒక్కసారిగా రెక్కలు రావడమే. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం గరిష్ఠంగా కిలో రూ.88 వరకు పలికింది. ఈ సీజన్లో మార్చి నెలాఖరులో తక్కువగా ఉన్న ధరలు వారం రోజులుగా పెరుగుతున్నాయి. మార్కెట్కు సరకు తక్కువగా వస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎండలతో దిగుబడి తగ్గడం వల్ల మార్కెట్కు రైతులు తక్కువగా తీసుకొస్తున్నారు. మదనపల్లె నుంచి రాష్ట్రంలోని నగరాలతో పాటు తమిళనాడులోని చెన్నై, కుంభకోణం, కేరళ రాష్ట్రంలోని పలు నగరాలకు టమాటాలను ఎగుమతి చేస్తున్నారు.
Latest News