by సూర్య | Sat, May 21, 2022, 01:18 PM
తాడిపత్రి పట్టణంలోని శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీభద్రావతి , భావనాబుషీశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఉత్సవాల్లో భాగంగా భద్రావతి భావనాబుషీశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం స్వామివారి కి శైవపుణ్యాహవాచనము, ఋత్విగ్వరణము, మృత్సం గ్రహణము, అంకురార్పణము, మహామంగళహారతి తదితర పూజకార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాద అందజేశారు.
Latest News