15 వేలకు తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు

by సూర్య | Sat, May 21, 2022, 12:48 PM

కోవిడ్ మహమ్మారి దేశంలో క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్తగా నమోదయ్యే రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్తగా నమోదయ్యే కేసుల కంటే మహమ్మారి బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం సానుుకూలాంశం. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15 వేల కంటే దిగువున పడిపోవడం శుభపరిణామమని చెప్పొచ్చు. రోజువారీ మరణాల సంఖ్య కూడా కొన్ని రోజులుగా 30లోపే నమోదవుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


గత 24 గంటల వ్యవధిలో 4,99,382 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,323 కొత్తగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 25 మంది కోవిడ్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి మొత్తం కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 5,24,348కు చేరింది. శుక్రవారం 2,346 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 14,996కు తగ్గింది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15,32,383 డోసుల టీకాలను పంపిణీ చేశారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM