'డయాబెటిస్' నియంత్రణకు తీసుకోవాల్సిన ఆహారమిదే

by సూర్య | Sat, May 14, 2022, 04:50 PM

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి మధుమేహం(డయాబెటిస్) బారిన పడుతున్నారు. ఈ తరుణంలో ఏం తినాలో, ఏం తినకూడదో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇక శరీరంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేసుకుంటూనే, ఆరోగ్యం దెబ్బతినకుండా మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఇక టైప్-1, టైప్-2 మధుమేహ బాధితులు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కని ఆరోగ్యం సాధ్యపడుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ప్రధాన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి. ఆకుకూరల్లో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి అవి రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేయవు.


అవకాడోస్‌లో 1 గ్రాము కంటే తక్కువ చక్కెర, కార్బోహైడ్రేట్‌లు, అధిక ఫైబర్ కంటెంట్ ఉంటాయి. కాబట్టి అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మధుమేహాన్ని నివారించే ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. తరచూ గుడ్లు తింటే, గుండె జబ్బులు దరి చేరవు. గుడ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. బీన్స్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. చిక్కుళ్ళు ఎక్కువగా తీసుకునే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి. నట్స్‌ రుచికరంగానే కాకుండా శరీరంలో సాధారణ వాపును తగ్గిస్తాయి. టైప్ 2 మధుమేహం ఉన్నవారిపై జరిపిన ఒక అధ్యయనంలో వాల్‌నట్ నూనెను రోజూ వినియోగించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగుపడతాయని తేలింది.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM