గంగమ్మ తల్లికి సారె సమర్పించిన జల్లా కలెక్టర్

by సూర్య | Sat, May 14, 2022, 01:53 PM

తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి తన కుటుంబ సమేతంగా విచ్ఛేసి, శనివారం ఉదయం శ్రీ తాతాయ్య గుంట గంగమ్మ తల్లికి సారెసమర్పించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తుడా కార్యాలయం వద్ద నుంచి వారిని స్వాగతించి. ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకొచ్చారు. అనంతరం గంగమ్మ ఆలయ పాలక మండలి చైర్మన్ కట్టా గోపి యాదవ్, అర్చకులు వారికి అమ్మవారి ఆలయం ఎదుట స్వాగతం పలికారు. 


అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ కి అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ అమ్మవారి కృప మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండేళ్ల పాటు జాతర ఏకాంతంగా జరిగిందని, అయితే ఈ సారి. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కృషితో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.

Latest News

 
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM
నాదెండ్ల వీరయ్య తెదేపాలో చేరిక Mon, Apr 29, 2024, 01:31 PM
మాజీ సీఎం చంద్రబాబును కలిసిన టిడిపి నాయకులు సుబ్బారెడ్డి Mon, Apr 29, 2024, 01:29 PM
ముఖ్యమంత్రి జగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే Mon, Apr 29, 2024, 01:28 PM
వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి Mon, Apr 29, 2024, 01:26 PM