యాదాద్రిలో జయంతి ఉత్సవాలు మొదటి రోజు
by సూర్య |
Fri, May 13, 2022, 03:54 PM
పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి. శుక్రవారం 13వతేది నుంచి 15 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవాచనంతో ఘనంగా ప్రారంభించారు అర్చకులు. జయంతి ఉత్సవాల్లో మొదటిరోజైన ఇవాళ తిరువెంకటపతి అలంకార సేవలో ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు అంతకుముందు ఆలయంలో స్వస్తివాచనంతో జయంతి ఉత్సవాలను శాస్త్రోత్తంగా ప్రారంభించిన అర్చకులు, స్వామివారికి కుంకుమార్చన నిర్వహించారు. ముందు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం, రక్షాబంధనం నిర్వహించారు. రెండోరోజైన రేపు కాళీయమర్థని అవతారం, రామావతారం, లక్షకుంకుమార్చన నిర్వహించనున్నారు అర్చకులు. జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన 15న సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలను పరిసమాప్తి పలకనున్నారు ఆలయ అర్చకులు
Latest News