చైనా దురాగతాలను ఉపగ్రహాలు పట్టేశాయి

by సూర్య | Wed, Jan 19, 2022, 07:24 PM

సరిహద్దుల్లో నిర్మాణం చేపడుతున్న చైనా దరాగతాన్ని ఈ సారి ఉపగ్రహ చిత్రాలు బందించేశాయి. తాజాగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సుపై 400 మీటర్ల కంటే పొడవైన వంతెనను చైనా కొత్తగా నిర్మిస్తోంది. ఈ నిర్మాణం పూర్తయితే భారత్, చైనా మధ్య కీలకమైన ఫ్లాష్ పాయింట్‌గా ఉన్న ప్రాంతంలో డ్రాగన్‌‌ సైన్యానికి గణనీయంగా ఉపయోగపడుతుంది. 8 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెన పాంగాంగ్ ఉత్తర తీరంలోని చైనా సైనిక స్థావరానికి దక్షిణంగా ఉంది. భారత్, చైనా మధ్య 2020లో కొనసాగిన ప్రతిష్టంభన సమయంలో ఫీల్డ్ హాస్పిటల్స్, సైనిక వసతులను ఈ ప్రాంతంలో ఆ దేశం ఏర్పాటుచేసింది. జనవరి 16న ఉపగ్రహాలు తీసిన ఫోటోల్లో వంతెన స్తంభాలను కాంక్రీట్ స్లాబ్‌లతో అనుసంధానించడానికి చైనా నిర్మాణ కార్మికులు భారీ క్రేన్‌ను ఉపయోగిస్తున్నట్టు సూచిస్తున్నాయి. నిర్మాణ పరిధిని బట్టి వంతెన కొన్ని నెలల్లో పూర్తికావచ్చు. కానీ, ఈ ప్రాంతంలోని చైనా ప్రధాన స్థావరం రుటోగ్‌‌తో అనుసంధానానికి మాత్రం మరిన్ని నెలల సమయం పడుతుంది. పాంగాంగ్ సరస్సు వద్ద చైనా వంతెన నిర్మాణం చేపట్టిన విషయం జనవరి మొదటి వారంలో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం నుంచి రుటోగ్ స్థావరానికి చేరుకోవాలంటే 200 కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంటుంది. అదే వంతెన పూర్తయిన 150 కి.మీ. దూరం తగ్గిపోనుంది. ‘‘ప్రతికూల వాతావరణం, భారీ మంచులో కొనసాగుతున్న నిర్మాణ ప్రక్రియకు మద్దతుగా భారీ యంత్రాలు (క్రేన్) కూడా ఏర్పాటు చేశారు’’ అని ఇంటెల్ ల్యాబ్‌కు చెందిన పరిశోధకుడు డామియన్ సైమన్ అన్నారు. ‘‘ఖుర్నాక్ ఫోర్ట్ (పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం) సమీపంలోని రహదారితో వంతెనను కలిపే ఒక తాజా ట్రాక్ గమనించాం.. ఇది ఉత్తరం వైపు ఉన్న ప్రాంతంతో మోటరబుల్ నెట్‌వర్క్‌తో మరింత కలుపుతుంది’’ అని పేర్కొన్నారు. చైనా కొత్తగా వంతెన నిర్మిస్తున్న ప్రాంతం 1958 నుంచి ఆ దేశం స్వాధీనం చేసుకున్న భూభాగంలో ఉంది.. దీనిని అక్రమ నిర్మాణంగానే భారత్ పరిగణిస్తోంది. ఇది భారత్ గుర్తించిన వాస్తవాధీన రేఖకు కుడివైపుగా ఉందని ఫోర్స్ ఎనాలసిస్‌కు చెందిన చీఫ్ మిలటరీ ఎనలిస్ట్ సిమ్ టాక్ వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రదేశం వాస్తవానికి సరస్సు ఇరుకైన ప్రదేశం కాబట్టి ఆచరణాత్మకంగా ఎంపిక చేసి ఉండవచ్చు.. కానీ రాజకీయ కోణంలో చూస్తే LAC గురించి భారత్ వివరణ ప్రకారం చైనా మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆక్రమణను కూడా సూచిస్తుంది’ అని అన్నారు. చైనా నిర్మాణ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్న విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ‘సుమారు 60 ఏళ్ల కిందట చైనా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మిస్తున్నారు..భారత్ ఇలాంటి చట్టవిరుద్ధాన్ని ఎన్నడూ అంగీకరించదనే విషయం మీకూ తెలుసు’అని పేర్కొంది.

Latest News

 
పిఠాపురంలో జనసేనానికి జన నీరాజనం Fri, May 10, 2024, 10:33 PM
ఏపీలో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయంటే.. అక్కడే అత్యధికం.. ఎవరికి ప్లస్? Fri, May 10, 2024, 10:06 PM
రేపు పిఠాపురం వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల సురేఖ Fri, May 10, 2024, 09:55 PM
లారీలో సీక్రెట్‌గా దొరక్కుండా దాచేసి.. ఏం తెలివిరా నాయనా.. ప్లాన్ మొత్తం రివర్స్ Fri, May 10, 2024, 09:09 PM
సింహాచలంలో వైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తుల క్యూ Fri, May 10, 2024, 09:05 PM