by సూర్య | Wed, Jan 19, 2022, 06:18 PM
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజు కు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే నమోదైన కేసుల సంఖ్య 10 వేలు దాటింది. మొత్తం 41,713 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 10,057 మందికి పాజిటివ్ వచ్చింది. విశాఖపట్నం జిల్లాలో 1,827, చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో, 1,222 మంది కరోనా నుండి కోలుకున్నారు మరియు 8 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 21,27,441కి చేరుకుంది. వీరిలో 20,67,984 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 14,522 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 44,935 యాక్టివ్ కేసులు ఉన్నాయి.