నేటి నుండి దక్షిణాఫ్రికాతో వన్డే సీరిస్

by సూర్య | Wed, Jan 19, 2022, 07:37 AM

భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. పార్లేలోని బోలాండ్ పార్క్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి తొలి మ్యాచ్ జరగనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమి నేపథ్యంలో ఈ సిరీస్ ఇప్పుడు టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరమవగా, కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లీ సాధారణ బ్యాట్స్‌మెన్‌గా మళ్లీ మైదానంలోకి రాబోతున్నాడు. దీంతో అతను ఎలా రాణించబోతున్నాడనే ఆసక్తి క్రికెట్ ప్రేమికుల్లో నెలకొంది. కెఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో అతని నుంచి మంచి స్కోరు అందుతుందని భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌తో వెంకటేష్ అయ్యర్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. రోహిత్ శర్మ జట్టులో లేకపోవడంతో ధావన్‌కు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM