12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలలకు మార్చి నుంచి టీకాలు

by సూర్య | Mon, Jan 17, 2022, 09:12 PM

కరోనా నేపథ్యంలో టీనేజర్లకు సైతం వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్దమవుతోంది. భారత్ లో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 15 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. జాతీయ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎన్.కె.అరోరా దీనిపై మాట్లాడుతూ, 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలలకు మార్చి నుంచి టీకాలు అందించే అవకాశముందని వెల్లడించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి మార్చి నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం, 15 ఏళ్లకు లోపు వారికి వ్యాక్సినేషన్ విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. దేశంలో 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు 7.4 కోట్ల మంది ఉన్నారని, వారిలో 3.45 కోట్ల మంది తొలి డోసు తీసుకున్నారని, 28 రోజుల వ్యవధితో రెండో డోసు తీసుకుంటారని అరోరా తెలిపారు. మిగిలిన వారికి ఈ నెలాఖరు కల్లా తొలి డోసు ఇస్తామని, తద్వారా వారు ఫిబ్రవరి చివరి నాటికి రెండో డోసు కూడా తీసుకుంటారని చెప్పారు. 12 నుంచి 14 ఏళ్ల లోపు వయసు వారు దేశంలో 7.5 కోట్ల మంది ఉంటారని డాక్టర్ అరోరా సూచనప్రాయంగా తెలిపారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM