మైలేజీ ఇవ్వకపోతే వాహనాన్ని వెనక్కి తీసుకొంటాం

by సూర్య | Mon, Jan 17, 2022, 09:10 PM

తమ బీఎస్6 ట్రక్కుల శ్రేణిలో ఏ ఒక్క మోడల్ అయినా అత్యధిక మైలేజీ ఇవ్వకపోతే దాన్ని వాపసు తీసుకుంటామని మహీంద్రా గ్రూపు అనుబంధ సంస్థ మహీంద్రా ట్రక్ అండ్ బస్ (ఎంటీబీ) పేర్కొంది. సరకు రవాణా వాహన విపణిలోనూ పట్టు సాధించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. మహీంద్రా గ్రూపు అనుబంధ సంస్థ మహీంద్రా ట్రక్ అండ్ బస్ (ఎంటీబీ) తాజాగా ఈ ఆసక్తికర ప్రకటన చేసింది. తమ బీఎస్6 ట్రక్కుల శ్రేణిలో ఏ ఒక్క మోడల్ అయినా అత్యధిక మైలేజీ ఇవ్వకపోతే దాన్ని వాపసు తీసుకుంటామని పేర్కొంది. తమ బీఎస్6 శ్రేణిలో భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాలు ప్రత్యర్థి వాహనాల కంటే మైలేజీ తక్కువ ఇస్తే, వినియోగదారులు ఆ వాహనాలను వెనక్కి ఇచ్చేయొచ్చని వివరించింది. బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ, ఫ్యూరియో ఐసీవీ, ఫ్యూరియో 7, జేయో మోడల్ వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎంటీబీ తాజా ప్రకటనలో తెలిపింది. ఇంధన ధరలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వినియోగదారుల పరంగా చూస్తే ఇది సరైన పథకం అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ సీఈవో వీజయ్ నక్రా పేర్కొన్నారు. వినియోగదారుల పరంగా చూస్తే, ఈ స్కీమ్ ప్రవేశపెట్టడానికి ఇదే సరైన తరుణం అని వెల్లడించారు. మహీంద్రా సంస్థ సాంకేతిక సామర్థ్యంపై వినియోగదారుల్లో నమ్మకాన్ని మరింత పెంపుదల చేసేందుకు తాజా స్కీమ్ ప్రకటనే నిదర్శనమని అన్నారు. రవాణా వాహన శ్రేణిలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పడంలో మహీంద్రా నిబద్ధత విశ్వసనీయమైనదని నక్రా పేర్కొన్నారు. "మైలేజీ రాకపోతే ట్రక్కును వెనక్కి ఇవ్వండి" అనే ఈ స్కీమ్ ను మహీంద్రా 2016లో తమ బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ ట్రక్కులకు అమలు చేసింది. ఆ సమయంలో 33 వేల బ్లేజో ట్రక్కులు అమ్ముడవగా, ఏ ఒక్కటి వెనక్కి రాలేదని మహీంద్రా సంస్థ సగర్వంగా వెల్లడించింది. ఇప్పుడు బీఎస్6 ప్రమాణాలతో రూపొందించిన కొత్త వాహన శ్రేణికి కూడా ఇదే స్కీమ్ వర్తింపజేస్తోంది. మహీంద్రా సంస్థ తన వాహనాలను ఎండీఐ టెక్ ఇంజిన్లు, ఫ్యూయల్ స్మార్ట్ సాంకేతిక పరిజ్ఞానం సహితంగా నిర్మిస్తోంది.

Latest News

 
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM
దగ్గర పడుతున్న పోలింగ్.. చంద్రబాబుపై మరో కేసు.. ఏ2గా నారా లోకేష్ Sun, May 05, 2024, 08:23 PM
డ్రామా అనుకుంటే మీరూ చేయండి.. రాళ్లదాడి ఘటనపై జగన్ సతీమణి భారతి రియాక్షన్ Sun, May 05, 2024, 08:18 PM
సజ్జలకు షాక్.. టీడీపీ ఫిర్యాదుపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణకు ఆదేశం Sun, May 05, 2024, 08:15 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ అద్భుత అవకాశం.. సొంతంగా సేవ చేసే ఛాన్స్ Sun, May 05, 2024, 07:43 PM