దెయ్యాలు ఉన్నాయి...నేను స్వయంగా తరిమేశా

by సూర్య | Mon, Jan 17, 2022, 03:58 PM

దెయ్యాలు ఉన్నాయి నేను స్వయంగా వాటిని తరిమేశా అని ఐఐటీ మండీ డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్ పేర్కొన్నారు. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా నిరంతరాయంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయని కొందరు చెపితే... లేవని నాస్తికులు వాదిస్తుంటారు. దీనిపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. దెయ్యాలు కచ్చితంగా ఉన్నాయని ఐఐటీ మండీ డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్ అన్నారు. దెయ్యాలు ఉన్నాయని తాను బలంగా నమ్ముతున్నానని ఆయన చెప్పారు. వాటిని తాను స్వయంగా తరిమి కొట్టానని కూడా తెలిపారు. 1993లో తాను చెన్నైలో ఉన్నప్పుడు తన స్నేహితుడి కుటుంబాన్ని దెయ్యాలు పీడించాయని లక్ష్మీధర్ చెప్పారు. తాను తన స్నేహితుడి ఇంట్లోకి వెళ్లి హరేరామ హరేకృష్ణ మంత్రంతో పాటు, భగవద్గీతలోకి కొన్ని శ్లోకోలను చదివానని, దీంతో దెయ్యాలు తన స్నేహితుడి కుటుంబాన్ని వదిలి వెళ్లాయని తెలిపారు. తన స్నేహితుడి కుటుంబ సభ్యుల్లోకి ఆత్మలు ప్రవేశించినప్పుడు వారు వింతగా ప్రవర్తించారని చెప్పారు. ప్రొఫెసర్ లక్ష్మీధర్ కు మేధావిగా ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. ఐఐటీ ఢిల్లీ నుంచి లక్ష్మీధర్ పీహెచ్డీ చేశారు. రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయనకు ఎంతో పేరుంది. అలాంటి వ్యక్తి దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

Latest News

 
ఈనెల 23 నుంచి సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ Sun, May 19, 2024, 11:16 AM
ప్రజలు శాంతియుత వాతావరణానికి సహకరించాలి Sun, May 19, 2024, 11:15 AM
దసబుజ వినాయకుడికి టిడిపి శ్రేణులు పూజలు Sun, May 19, 2024, 11:05 AM
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు Sun, May 19, 2024, 10:59 AM
రైతు భరోసా కేంద్రంలో రైతులకు జీలగులు, జనములు పంపిణీ Sun, May 19, 2024, 10:03 AM