అదృష్టం అంటే ఇదే మరి...పోయే ప్రాణాలు దక్కాలి

by సూర్య | Mon, Jan 17, 2022, 03:55 PM

అదృష్టం అంటే ఇదే మరి..పోయే ప్రాణాలు దక్కాలి. ఈ ఆసక్తికర ఘటన బెల్జియంలో జరిగింది. అది బ్రస్సెల్స్ (బెల్జియం) లోని రోగిర్ మెట్రో స్టేషన్. నడి వయసు మహిళ మెట్రో రైలు కోసం వేచి చూస్తోంది. కొన్ని సెకన్లలోనే మెట్రో రైలు వచ్చి ప్లాట్ ఫామ్ పై ఆగితే ఆమె ఎక్కి వెళ్లిపోయేది. కానీ, అలా జరగలేదు. రైలు ప్లాట్ ఫామ్ పైకి రావడానికి సరిగ్గా నాలుగైదు సెకన్ల ముందు ఓ ఆగంతుకుడు వెనుక నుంచి వచ్చి ఆమెను పట్టాలపైకి తోసేశాడు. ఇదంతా కనురెప్పపాటు వేగంలో జరిగిపోయింది. రైలు పట్టాలపైన పడిపోయిన మహిళను మెట్రో డ్రైవర్ వెంటనే గమనించి అత్యవసర బ్రేక్ సాయంతో నిలిపివేశాడు. ప్లాట్ ఫామ్ పై ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టం ఏమిటంటే మహిళ ప్రాణాలతో బయటపడడమే కాదు, పెద్దగా గాయాలు కూడా కాలేదు. ఆమె బాగా మందంగల ఉన్నిస్వెటర్ వేసుకోవడం, పడిన తీరు ఆమెను కాపాడాయి. డ్రైవర్ సమయస్ఫూర్తి కూడా రక్షించింది. కానీ, ఈ ఘటనతో రైలు డ్రైవర్ షాక్ కు గురయ్యాడు. దీంతో స్టేషన్ రక్షణ సిబ్బంది మెట్రో పైలట్ ను, మహిళను హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స చేసి వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మహిళను పట్టాలపైకి తోసేసి పరారైన ఆగంతుకుడిని పోలీసులు ఛేదించి మరో మెట్రో స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అలా చేశాడో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అతడి మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్ ను నియమించారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM