వీడసలు భర్తేనా.. స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం!

by సూర్య | Mon, Jan 17, 2022, 02:09 PM

సమాజంలో కొంత మంది వికృత చేష్టలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా తన స్నేహితులతో కలిసి సొంత భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందులో భాదితురాలు ఓ ప్రభుత్వ టీచర్(32). వివరాలు ఇలా ఉన్నాయి. సదరు మహిళ కు ఫేమస్ మ్యాట్రిమొని ద్వారా ఇండోర్ కు చెందిన వ్యాపారవేత్త అని చెప్పుకుంటున్న రాజేశ్ విశ్వకర్మతో పరిచయం ఏర్పడింది. ప్రొఫైల్ లో అతడు మంచివాడిగా బుద్ధిమంతుడి పోజులో దర్శనమివ్వడంతో 2019లో పెళ్లి చేసుకుంది.


కొత్త కాపురం పేరుతో ఆమెను ఇండోర్ లోని పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఫామ్ హౌజ్ కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ అతడి నలుగురు స్నేహితులు మాటు వేసి ఉన్నారు. వారితో కలిసి అసహజ రీతిలో తన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు రాజేశ్. ఆమె ప్రైవేట్ పార్ట్ లపై సిగరేట్లతో కాల్చుతూ చిత్రహింసలకు గురి చేశారు. ఎలాగోల వారి నుండి తప్పించుకున్న ఆ మహిళ పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత తాము కోరినప్పుడల్లా తమ కోరిక తీర్చడానికి రావాలని ఫోన్ లో బెదిరించారు. లేకుంటే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మరోసారి ఆమె ఫాం హౌజ్ వచ్చేలా చేసి 2021 అక్టోబర్ లో రెండోసారి అదే ఐదుగురు కలిసి అసహజ రీతిలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వేధింపులు భరించలేకపోయిన ఆ మహిళ చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. భర్త చేసిన నిర్వాహకంపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై క్రూరంగా దాడికి పాల్పడిన ఆ మానవ మృగాళ్లను అరెస్ట్ చేశారు.

Latest News

 
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? Fri, May 03, 2024, 04:04 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది Fri, May 03, 2024, 04:03 PM
చంద్ర‌బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే Fri, May 03, 2024, 04:03 PM
ఒక హామీ అప్పుడే మాయమైనది Fri, May 03, 2024, 04:02 PM
కార్మికులకు భధ్రత కల్పించింది వైసీపీ ప్రభుత్వమే Fri, May 03, 2024, 04:02 PM